తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది…

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది*

తిరుపతి :

వీకెండ్ వచ్చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు…..