2023 తెలంగాణ ఎన్నికలపై నిఘా పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం..!

*2023 తెలంగాణ ఎన్నికలపై నిఘా పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం.*

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా అడ్డుకట్టవేయాలని నిర్ణయం.

ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

ఈ సోదాల్లో అధికారులు సైతం అవాక్కయ్యేలా బయటపడుతున్న నోట్ల కట్టలు, సొమ్ములు.

షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 307కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్న అధికారులు .

ఇందులో నగదు 105కోట్ల 58 లక్షలు కాగా.. 13 కోట్ల 58 లక్షలు విలువ చేసే 72 వేల లీటర్ల మద్యాన్ని సీజ్.

ఇక పోలీసులు సీజ్ చేసిన బంగారం, వెండి, వజ్రాల విలువ 145కోట్ల 67లక్షలు అన్నట్లు ఈసీ అంచనా

ఇవి కాకుండా 27కోట్ల విలువచేసే బియ్యం, చీరలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు స్వాధీనం

గడిచిన 24గంటల్లోనే 18కోట్ల మేర సొత్తును స్వాధీనం చేసుకున్నారు.