*
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో విషాదం నెలకొంది. తహసీల్దార్ ఫరీదొద్దిన్కు గుండె పోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గోని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే గుండే పోటు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే ఆయన్ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫరీదుద్దీన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.