వన్డే ప్రపంచకప్ 2023 తొలి పోరుకు టీమిండియా ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది..
వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో 199 పరుగుల స్కోరు వద్ద ఆస్ట్రేలియాను భారత్ ఆలౌట్ చేసింది. టీమిండియా విజయానికి కేవలం 200 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. 71 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు బాదాడు. డేవిడ్ వార్నర్ 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. వార్నర్ 6 ఫోర్లు బాదాడు. లాబుషాగ్నే 27 పరుగులు మరియు మాక్స్వెల్ 15 పరుగులు అందించారు. 15 పరుగుల వద్ద పాట్ కమిన్స్ ఔటయ్యాడు.
భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. రవీంద్ర జడేజా 10 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్ విజయం సాధించాడు. ఫాస్ట్ బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. కేవలం వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) మాత్రమే పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లెవ్వరూ సత్తా చాటలేకపోయారు. ఇక 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 41.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేధించింది. వాస్తవానికి.. భారత్కు ఆదిలోనే పెద్ద ఝలక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యారు. ఈ దెబ్బకు భారత జట్టు కష్టాల్లో పడింది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో.. ఈ 200 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేధించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అప్పుడే మేమున్నామంటూ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టుని ఆదుకున్నారు. అసాధ్యమనుకున్న ఫీట్ని సుసాధ్యం చేసి.. అందరి మన్ననల్ని చూరగొంటున్నారు.
నిజానికి.. విరాట్ కోహ్లీ 12 వ్యక్తిగత పరుగుల వద్దే క్యాచ్ ఔట్ అవ్వాల్సింది. కానీ.. మిచెల్ మార్ష్ ఆ క్యాచ్ని వదిలేశాడు. బంతి గాల్లో చాలాసేపటి వరకు ఉన్నప్పటికీ.. అతడు సరిగ్గా అందుకోలేకపోయాడు. ఇలా తనకొచ్చిన లైఫ్ని కోహ్లీ సద్వినియోగపరచుకొని.. 85 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని జోడించాడు. ఇక లక్ష్యం దగ్గరపడేకొద్దీ కోహ్లీ దూకుడు పెంచుతూ వచ్చాడు. అతడు సెంచరీ చేయడం ఖాయమని అనుకున్న తరుణంలో.. హాజిల్వుడ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. కోహ్లీ తర్వాత వచ్చిన పాండ్యాతో కలిసి.. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ని ముగించాడు. సిక్స్ కొట్టి భారత్ని గెలిపించాడు