అగ్నిపథ్‌’ కింద సైనిక నియామకాల నోటిఫికేషన్‌ విడుదల..

‘అగ్నిపథ్‌’ కింద సైనిక నియామకాలకు సంబంధించి భారత సైన్యం (ఆర్మీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జులై నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. అగ్నివీరుల టెక్నికల్‌ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్స్‌మెన్‌కు 8వ తరగతిని విద్యార్హతగా నిర్ణయించింది. అభ్యర్థులు 17½ – 23 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలను ఆర్మీ వెబ్‌సైట్‌ (https://joinindianarmy.nic.in/) లో చూడొచ్చు.