ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా? కంటి చికిత్స తరువాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే,.వైసీపీ నేతలు కౌంటర్లు..!.

ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా? కంటి చికిత్స తరువాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే,న్యాయం గెలిచిందనే టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు నిజం గెలిచిందంటూ సంబరాలు చేసుకుంటున్నాయి…

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు : రోగాలు ఉన్నందుకే చంద్రబాబుకు స్కిల్‌ స్కాం కేసులో కోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని, ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉంటూనే టీడీపీ అధికార ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి పని చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు బెయిల్‌ పరిణామంపై విజయవాడలో మంగళవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నాయనే. చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు. అనారోగ్యాలతో బెయిల్‌ తెచ్చుకున్నారు. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ చంద్రబాబుకి ఉన్నట్లు చూపించి బెయిల్‌ తెచ్చుకున్నారు. చంద్రబాబుకి ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్‌ మాత్రమే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే” అని వెల్లంపల్లి అన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి: చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్ధం లేదని మండిపడ్డారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని అన్నారు. మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు.

‘బెయిల్ రాగానే నిజం ఎక్కడ గెలిచినట్లు? ఇది విజయోత్సవాలు జరపాల్సిన సందర్భమేనా?. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు జైలులో ఉన్నా.. బయట ఉన్నా పెద్ద తేడా లేదు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు విప్లవకారుడా..? స్వాతంత్ర్య ఉద్యమకారుడా?. అలిపిరి ఘటన జరిగినప్పుడే చంద్రబాబును ఎవరూ పట్టించుకోలేదు. పేదలకు మంచి చేసి ఉంటే చంద్రబాబు కోసం కన్నీళ్లు కారుస్తారు. చంద్రబాబు జైలుకెళితే ఎవరూ బాధపడలేదు.’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

అంబటి రాంబాబు : స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి వచ్చిన బెయిల్‌ మానవతా దృక్పథంతో ఇచ్చింది మాత్రమేనని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో బాబుకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చారని, దీనిపై టీడీపీ చాలా హంగామా చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారని తెలిపారు. బాబుకి మధ్యంతర వేలు వచ్చిందని టిడిపి శ్రేణులు చిత్రంగా పండగ చేసుకోవడం చూసే వాళ్ళందర్నీ నవ్వు పుట్టిస్తుంది అన్నారు..