ఆపరేషన్‌ లోటస్‌ పేరుతో తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చిచే ప్రయత్నం..ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్

ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆప్‌ ప్రభుత్వం భావిస్తోంది. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చిచే ప్రయత్నం చేస్తున్నట్లు ఆప్‌ ఆరోపించింది. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆపరేషన్‌ లోటస్‌ పేరుతో ఆ దందా సాగుతోందని ఆప్‌ విమర్శలు చేసింది…

విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పంజాబ్ ఆప్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
ప్రభుత్వ డిమాండ్‌ను పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బుధవారం తోసిపుచ్చారు. సెప్టెంబర్ 22న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సంబంధించిన ఉత్తర్వులను గవర్నర్ ఉపసంహరించుకున్నారు. కేబినెట్ ఆమోదించిన ప్రత్యేక సమావేశాన్ని గవర్నర్ ఎలా తిరస్కరిస్తారు.. ప్రజాస్వామ్యం ముగిసింది.. రెండు రోజుల క్రితం గవర్నర్ సెషన్‌కు అనుమతి ఇచ్చారు.. పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమవడం ప్రారంభించింది.నంబర్ పూర్తి కాలేదు, అనుమతిని ఉపసంహరించుకోమని పై నుండి కాల్ వచ్చింది అంటూ గవర్నర్ నిర్ణయంపై ఢిల్లీ సీఎం,ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు….