టెన్త్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.. బండి సంజయ్..

టెన్త్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోంది. కేసీఆర్ సర్కార్‌లో పరీక్ష పేపర్ల లీకేజీ సాధారణంగా మారినట్లు కనిపిస్తోందన్నారు. పరీక్షలు సరిగా నిర్వహించలేని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం బాధకరమని పేర్కొన్నారు. తెలుగు పేపర్ లీకేజీలో విద్యార్థులకు న్యాయం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజ‌మాన్యాల‌కు స‌ర్కార్ తొత్తుగా మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్..