మండిపోతున్న ఎండలు.. రెండు వారాల వ్యవధిలో కోటియాభై లక్షల బీర్లు తాగేసిన తెలుగు రాష్ట్రాల…మద్యం ప్రియులు.!

*మండిపోతున్న ఎండలు..కడుపులోకి గుట గుటా తాగుతున్న బీర్లు.. 17 రోజుల్లో …కోటియాభై లక్షల బీర్లు తాగేసిన తెలుగు రాష్ట్రాల…మద్యం ప్రియులు!*

అసాధారణంగా పెరుగుతున్న ఎండలు

బీర్లవైపు చూస్తున్న మందుబాబులు

రోజుకు సగటున 8 లక్షల బీర్ల అమ్మకం

రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు

ఏప్రిల్ నెల వచ్చింది మొదలు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు తెలుగు రాష్ట్రాల వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో మందుబాబుల చూపు బీర్లపై పడింది. ఫలితంగా ఈ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు నగరంలో ఏకంగా 1.50 లక్ష ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది.

ఆ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం 8,46,175 కేసుల బీర్లు అమ్మడుపోయాయి. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 10,154,100 బీర్లు అమ్ముడుపోయాయి. అలాగే, ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.