నాగాలాండ్, త్రిపురలో భాజపా హవా.. హంగ్ దిశగా మేఘాలయ
*నాగాలాండ్, త్రిపుర.:-* ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర నాగాలాండ్ మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడుతున్నాయి.
ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. త్రిపుర, నాగాలాండ్లో భాజపా (BJP) హవా కొనసాగుతుండగా.. మేఘాలయ ఫలితం మాత్రం హంగ్ దిశగా ఉంది. ఉదయం 9.45 గంటల వరకు వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా ఉన్నాయి.
✧ త్రిపురలో భాజపా కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది..
✧ నాగాలాండ్ లో భాజపా ఎన్డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటి వరకు ఈ కూటమి ఒక చోట విజయం సాధించగా.. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్పీఎఫ్ 6, కాంగ్రెస్ 1, ఎన్పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
✧ మేఘాలయ లో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇక్కడ సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ 15, తృణమూల్ కాంగ్రెస్ (TMC) 15 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇతరులు 16 స్థానాల్లో, భాజపా 6, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఈ మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజార్టీ 31 సీట్లు.