నేడు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం..

నేడు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం.

_ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో నిర్వహించే సమావేశానికి ఎంపీలందరూ హాజరు కావాలని పార్టీ ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావుసహా ఎంపీలందరూ పాల్గొనే ఈ సమావేశంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు..