అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెట్ పథకంపై దేశ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన..!!
భారత త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్మెట్ పథకంపై దేశ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ కార్యాలయం శనివారం ప్రకటించింది.’అగ్నిపథ్’ కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది…