సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఐడీ ఎదుట హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న లోకేష్ను అధికారులు సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు.
హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని CRDAపై ఆయన ఒత్తిడి తెచ్చారని ప్రధాన అభియోగాలు మోపింది.