**
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఇటీవలే కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల కేటాయించిన కేసీఆర్, ఈనెల 14న కొండగట్టులో పర్యటించనున్నారు. మరోవైపు యాదగిరిగుట్టకు ప్లాన్ ఇచ్చిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారు.