ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్..

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్న సీఎం కేసీఆర్…

Cm KCR..
బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి యశోదా ఆసుపత్రి సికింద్రాబాద్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిగాటుతో ఆసుపత్రికి వచ్చారని, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమికంగా కుట్లు వేసి ఆయనను ఆసుపత్రికి తరలించారని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. డాక్టర్ ప్రసాద్ బాబు (dr. Prasad Babu), వినీత్ వైద్యుల టీం ఆయనకు చికిత్స అందించారని వెల్లడించారు.కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటెస్టైన్ కి గాయం ఉందని, 3 గంటలు శస్త్ర చికిత్స చేశామని వివరించారు. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడం కష్టం అని గుర్తించామన్నారు. రెండు పేగులు కలిపి 4 చోట్ల గాయమైందన్నారు. చిన్న పేగులో 15 సెంటీమీటర్ వరకు తొలగించామన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స జరిగినప్పుడు రోగి త్వరగా కోలుకోవడం కష్టం అని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం గురించి తెలియజేస్తామన్నారు…
కొత్త ప్రభాకర్ రెడ్డి పూర్తి కోలుకుంటున్నారో లేదో 4 రోజుల తర్వాత చెప్పగలమని డాక్టర్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. 4 రోజుల తర్వాత ఆయనను వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. ప్రభాకర్ రెడ్డికి హైపర్ టెన్షన్ ఉందని తెలిపారు.

దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సోమవారం రాత్రి పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్‌.. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై తీశారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని సీఎం పేరొన్నారు. ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌ రావును సీఎం ఆదేశించారు….కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన దురదృష్టకరమని కేసీఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేరొన్నారు. ఎన్నికల సభలను ముగించుకుని హెలికాఫ్టర్‌ లో సోమవారం సాయంత్రం బేగం పేట ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్న ముఖ్యమంత్రి హుటాహుటిన యశోద హాస్పిటల్‌ కు వెళ్లాలని భావించారు. అయితే ప్రభాకర్‌ రెడ్డికి ఆపరేషన్‌ జరుగుతున్నదని ఇంకా రెండు, మూడు గంటలు సమయం పడుతుందని సమాచారం అందడంతో ముఖ్యమంత్రి 8 గంటల ప్రాంతంలో హాస్పిటల్‌ కు చేరుకుని ప్రభాకర్‌ రెడ్డి ని పరామర్శించారు. హాస్పిటల్‌ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు , కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట మంత్రులు తన్నీరు హరీష్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనా చారి తదితరులు ఉన్నారు.