తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ లో మరో మూడు ఈఎస్‌ఐ హాస్పిటల్స్ ఏర్పాటు గ్రీన్ సిగ్నల్..!!!

*?తెలంగాణకు కేంద్రం శుభవార్త*

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ లో మరో మూడు ఈఎస్‌ఐ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపెంద్ర యాదవ్ ప్రకటించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో వంద పడకల ఆస్పత్రుల నిర్మాణానికి సంగారెడ్డి, శంషాబాద్, రామ గుండం లలో స్థలం కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. నాచారం , రామ చంద్ర పురంలో నిర్మించిన హాస్పిటల్స్ ని త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ కి కాత్ లాబ్స్.. న్యూక్లియర్ మెడిసిన్, రెడియో థెరపీ యూనిట్ లు దేశం లో రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో ఒకటి..హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేస్తున్నామని వివరించారు..