హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం

సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్‌, తుక్కు (స్క్రాప్‌) గోదాంలో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 11 మంది సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద సమయంలో టింబర్‌డిపోలో 15 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. మృతులంతా బిహార్‌కు చెందిన వలస కార్మికులుగా పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్‌డిపోతోపాటు స్క్రాప్‌ గోదాం కూడా ఉంది. టింబర్‌ డిపో నుంచి స్క్రాప్‌ గోదాముకు మంటలు వ్యాపించినట్లు సమాచారం..తెల్లవారుజామను స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.. అందులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకుపోయారు.. ఇద్దరు కార్మికులను ఫైర్‌ సిబ్బంది కాపాడారు.. ఇక, స్క్రాప్ గోదాం పక్కనే టింబర్‌ డిపోలు ఉన్నాయి.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన ఎనిమిది ఫైర్‌ ఇంజన్లు.. మంటలను అదుపుచేశాయి.