గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష…

నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, మహేష్‌ గౌడ్‌, అంజన్‌కుమార్‌, వీ.హనుమంతరావు, మల్లు రవి, రాములు నాయక్‌, కోదండరెడ్డి, సునీతారావు తదితరులు పాల్గొన్నారు.