చరిత్రలో ఈరోజు..ఏప్రిల్ 22 .
గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 112వ రోజు (లీపు సంవత్సరములో 113వ రోజు) . సంవత్సరాంతమునకు ఇంకా 253 రోజులు మిగిలినవి.
సంఘటనలు..
1912 – ప్రావ్దా (Pravda), సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రచురణ ప్రారంభించబడింది.
జననాలు..
1724: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1804)
1870: లెనిన్, రష్యా విప్లవనేత.
1883: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (మ.1974)
1936: మకాని నారాయణరావు, లండన్లోని అడ్వాన్డ్స్ లీగల్ స్టడీస్ ఇన్సిట్యూట్లో పనిచేశారు, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
1939: శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.
1959: దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు.
మరణాలు.
1933: సర్ హెన్రీ రోయ్స్, కార్ల నిర్మాణదారుడు.
1994: రిచర్డ్ నిక్సన్, అమెరికా 37వ అధ్యక్షుడు.
పండుగలు , జాతీయ దినాలు.
?ధరిత్రి దినోత్సవం…