చరిత్రలో ఈ రోజు…

జులై 14..

, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 195వ రోజు (లీపు సంవత్సరములో 196వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 170 రోజులు మిగిలినవి.

..సంఘటనలు.

2015 – గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.

* జననాలు

1794: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (మ.1868)

1857: మేటాగ్, వాషింగ్ మెషిన్ (బట్టలు ఉతికే యంత్రం) ని కనిపెట్టిన శాస్త్రవేత్త.

1860: పూండ్ల రామకృష్ణయ్య, తెలుగు పండితుడు, విమర్శకుడు. (మ.1904)

1862: ఫ్లోరెన్స్ బాస్కం, మొట్టమొదటి పి.హెచ్‌డి పొందిన అమెరికన్ మహిళ.

1893: గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.1952)

1904: వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (మ.1993)

1918: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007)

1920: శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (మ.2004).

1947: గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (మ.2020)

1950: గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త.

1956: తనికెళ్ళ భరణి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు.

1959: చాగంటి కోటేశ్వరరావు, అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి

1975: పంకజ్ భడౌరియా, 2010లో జరిగిన మాస్టర్ షెఫ్ ఇండియా మొదటి సీజన్ విజేత.

మరణాలు .

1958: కింగ్ ఫైజల్ II, ఇరాక్ రాజు (జ.1935).

2015: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928)
ఝాన్సీలక్ష్మి ముదిరాజ్,..