*🌏 చరిత్రలో ఈరోజు 🌎*
*🌅అక్టోబర్ 7🌄*
*🏞సంఘటనలు🏞*
1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.
*🌻🌻జననాలు🌻🌻*
1885: నీల్స్ బోర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962)
1900: గంటి జోగి సోమయాజి, ప్రముఖ తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి మరియు కులపతి, కళాప్రపూర్ణ. (మ.1987)
1900: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్ మరియు నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (మ.1945)
1901: మసూమా బేగం, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)
1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు మరియు ఉత్తమ అధ్యాపకుడు. (మ.2011)
1945: అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
*🌹🌹మరణాలు🌹🌹*
1940: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
1975: డి.వి.గుండప్ప, ప్రముఖ కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887)
1976: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904)
2007: పి.యశోదారెడ్డి, ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)