చరిత్రలో ఈరోజు…

చరిత్రలో ఈరోజు.

*🌅అక్టోబర్ 21🌄*

*🏞సంఘటనలు🏞*

1934: లోక్‌నాయక్‌ జయప్రకాశ్ నారాయణ్‌ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడిగా ‘కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ’ ఆవిర్భావం.

1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.

1954: పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.

1990: దూరదర్శన్‌ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం.

*🌻🌻జననాలు🌻🌻*

1833: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)

1881: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963)

1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.

1915: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు

1920: తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు

1925: సూర్జీత్ సింగ్ బర్నాలా, ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)

1930: షమ్మీ కపూర్, భారత ప్రముఖ సినీనటుడు మరియు దర్శకుడు. (మ.2011)

1947: నోరి దత్తాత్రేయుడు, సుప్రసిద్ధ భారతీయ వైద్యుడు మరియు రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు.

*🌹🌹మరణాలు🌹🌹*

1985: పింగళి దశరధరామ్ హేతువాది, పత్రికా సంపాదకుడు.

1986: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923)

1996: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (జ.1915)

2002: హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు మరియు అనువాదకుడు. (జ.1920)

2005: మహీధర నళినీమోహన్, సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు.

*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు*🔷

🔻పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.