హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా బంగారం నగదు పట్టివేత..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా పోలీసులు తనిఖీలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మియాపూర్‌లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది.

వనస్థలిపురం పీఎస్ పరిధిలో కారులో డబ్బులు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్SOT పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 29లక్షల 40వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని కవాడీగూడలో భారీగా డబ్బు సీజ్ చేశారు. కవాడీగూడలో 2 కోట్ల 90 లక్షలను అధికారులు సీజ్ చేశారు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు…

*మియాపూర్ లో భారీగా బంగారం నగదు పట్టివేత*

హైదరాబాద్..
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో పెద్ద మొత్తం నగదు పట్టుబడుతుంది.

సోమవారం ఉదయం హైదరాబాద్ నగరంలో మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద మాదాపూర్ ఎస్ఓటి పోలీ సులు తనిఖీలు చేపట్టి..భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఎలాంటి పత్రాలు లేకుండా 27 కేజీల బంగారు ఆభరణాలు, 15కిలోల వెండి ఆభరణాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొలెరో కారులో బషీర్ బాగ్ లోని ఓ నగల దుకాణం నుండి బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్తున్నట్లు నిందితులు చెబుతున్నారు.

ఈ తనిఖీల్లో మొత్తం 14 కోట్ల 70 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును ఎస్ఓటి పోలిసుల సీజ్ చేసి మియాపూర్ పోలీసులకు అప్పగించారు.

స్కూటీలో తరలిస్తున్న 14 లక్షల 93 వేల నగదు మియాపూర్ పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు…