దక్షిణాఫ్రికాతో వరుసగా రెండు మ్యాచులలో ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడ్డ భారత జట్టు.. కీలకమైన మూడో మ్యాచ్ లోవిజయం సాధించింది.. రెండు మ్యాచులలో ఓడినా మూడో మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ లో రాణించిన భారత జట్టు.. తర్వాత బౌలింగ్ లో సఫారీలకు చుక్కలు చూపించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ నిర్దేశించిన 180 పరుగులను ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా.. 19.1 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ కు నాలుగు వికెట్లు దక్కగా.. చాహల్ కు 3 మూడు వికెట్లు తీసి సఫారీల పతనాన్ని శాసించారు. ఫలితంగా భారత జట్టు.. 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. భువనేశ్వర్ కుమార్ మరోసారి ఆకట్టుకున్నాడు. పిచ్ స్పిన్ కు సహకరిస్తుండటంతో పంత్.. నాలుగో ఓవర్లోనే అక్షర్ కు బంతినిచ్చాడు. అయితే కెప్టెన్ నమ్మకాన్ని అక్షర్ వమ్ము చేయలేదు. నాలుగో ఓవర్ ఆఖరి బంతికి అతడు బవుమా (8) ను ఔట్ చేశాడు.
ఆరో ఓవర్ వేసిన హర్షల్ పటేల్.. చివరి బంతికి మరో ఓపెనర్ హెండ్రిక్స్ (23.. 2 ఫోర్లు, 1 సిక్స్) ను పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన చాహల్.. డసెన్ (1) ను ఔట్ చేసి దక్షిణాఫ్రికా కు షాకిచ్చాడు. వన్ డౌన్ లో వచ్చిన ప్రెటోరియస్ (16 బంతుల్లో 20.. 2 ఫోర్లు, 1 సిక్స్) ను కూడా చాహల్ 9వ ఓవర్లో ఔట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా.. 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. భారత జట్టులో రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54), హార్ధిక్ పాండ్యా (31) లు రాణించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...