క్రీడలు భారత్ 574 డిక్లేర్… శ్రీలంక 108/4….భారీ ఆధిక్యంలో భారత్..

భారత్,శ్రీలంక మధ్య జరుగుతోన్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. క్రీజులో అసలంక(1) పథుమ్ నిశాంక(26) పరుగులతో ఉన్నారు. ఓపెనర్లు. అంతకు ముందు భారత్ 574/8 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. శ్రీలంక ఓపెనర్లు కరుణ రత్నె 28, తిరుమన్నె 17, మ్యాథ్యూస్ 22 పరుగులు చేశారు. శ్రీలంక ఇంకా 466 పరుగుల వెనుకంజలో ఉంది భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు, జడేజా, బుమ్రాలు చెరో వికెట్ పడ్డాయి…..శ్రీలంక‌తో మొహాలీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా ప‌ట్టు బిగిస్తోంది. తొలుత రవీంద్ర జడేజా (175 నాటౌట్; 228 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో ) భారీ శతకంతో రాణించ‌డంతో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 574 ప‌రుగులు చేసింది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి నాలుగు వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు చేసింది. ఇంకా 466 ప‌రుగుల వెనుకంజ‌లో లంక ఉంది. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. బుమ్రా, జ‌డేజా చెరో వికెట్ తీశారు. ప్ర‌స్తుతం నిశాంక‌(26), చరిత్ అసలంక(1) క్రీజులో ఉన్నారు.
చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు క‌రుణ ర‌త్నె(28), ల‌హిరు తిరిమ‌న్నె(17) తొలి వికెట్‌కు 48 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని అశ్విన్ విడ‌గొట్టాడు. లాహిరు తిరిమన్నేను ఎల్బీగా అశ్విన్ వికెట్ల ముందు దొర‌క‌బుచ్చుకున్నాడు. మ‌రికాసేప‌టికే మ‌రో ఓపెన‌ర్ దిముత్ కరుణరత్నేను జ‌డేజా పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో 59 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి లంక క‌ష్టాల్లో ప‌డింది..