తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్.
ఇవాళ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. వివిధ అంశాలపై చర్చించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై మండిప్డడారు.. కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదన్న ఆయన.. కేసీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రజాశాంతి పార్టీ తరపున తెలంగాణలోని అన్ని జిల్లాలు తిరుగుతా… తెలంగాణలో కేసీఆర్ ముక్త్ పాలన రావాలని అని పిలుపునిచ్చారు…రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ నా శిస్యుడే అన్నారు పాల్.. ఆయన్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కొత్త రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక, తెలంగాణ అభివృద్ధి కొరకు 1982 నుంచి నేను కృషి చేస్తున్నట్టు తెలిపారు.. బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది.. అప్పుల తెలంగాణ మాత్రమే మిగిలింది.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..బీజేపీకి ఇప్పటి వరకు అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారు.? అని కేసీఆర్ని నిలదీశారు కేఏ పాల్.. ఇక, కేసీఆర్ నన్ను కలిశారు ఆశీస్సులు తీసుకున్నారు…కానీ, ఇప్పుడు 30 సీట్లు కూడా కేసీఆర్ గెలువడు. అని జోస్యం చెప్పారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయింది.. మరో 20 ఏళ్లు ఎవరు పాలన చేసినా ఇబ్బందులే అని ఆవేదన వ్యక్తం చేశారు.. 18 పార్టీల నేతలు నేను కలిసి ఆగస్టు నెలలో సమావేశం పెట్టామని వెల్లడించారు కేఏ పాల్..