పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు గుర్తింపు..

*దిల్లీ.. కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు..

గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్‌ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. వీటికి అదనంగా- గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడూ కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్‌ కారణమని నిపుణలు అభిప్రాయపడుతున్న సంగతి గమనార్హం..