మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు..

R9Telugunews.com.
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ల్ల‌న్న సాగ‌ర్‌కు చేరుకున్నారు. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు.. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ ద్వారా మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌కు చేరుకున్నారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హ‌రీష్‌రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ అతిపెద్ద రిజ‌ర్వాయర్‌. ఈ రిజ‌ర్వాయ‌ర్ లో 50 టీఎంసీల నీటిని నిల్వ‌చేసే సామ‌ర్థ్యం ఉంటుంది..
కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జ‌లాశ‌యంలో అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. మల్లన్నసాగర్‌ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం స్విచ్ఛాన్ చేసిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లోకి సీఎం కేసీఆర్ నీటిని విడుద‌ల చేశారు.ఏరియ‌ల్ వ్యూ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టును ప‌రిశీలించారు..