తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోట్ వేయండి, పోటీ చేయని దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వోట్ వెయ్యండి
రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన అసదుద్దీన్ ఒవైసి. రాహుల్ గాంధీ వయనాడ్ కాదు, దమ్ముంటే హైదరాబాద్ వచ్చి నా మీద పోటీ చేయి.
తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోట్ వేయండి, పోటీ చేయని దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వోట్ వెయ్యండి – అసదుద్దీన్ ఒవైసి..
రాహుల్ గాంధీ హైదరాబాద్ నుండి ఎన్నికలలో పోటీ చేయమని సవాలు చేస్తున్నాను మరియు వాయనాడ్ నుండి కాదు. మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు, మైదానంలోకి వచ్చి నాపై పోరాడండి. కాంగ్రెస్కు చెందిన వారు చాలా విషయాలు చెబుతారు, కానీ నేను సిద్ధంగా ఉన్నాను… కాంగ్రెస్ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేయబడ్డాయి…’’ అని అన్నారు.
మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే (కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి) ఉన్నారు. క్షేత్రస్థాయికి వచ్చి నాపై పోరాడండి’ అని అన్నారు..
నెల ఆరంభంలో తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎం పార్టీలు ఐక్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ కూటమికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతోందన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాత్రమే కాకుండా.. బీజేపీ, ఎంఐఎంతో పోరాడుతోంది. వారు తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటారు. కానీ, వారంతా ఐక్యంగానే పనిచేస్తున్నారు’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఒవైసీ తాజాగా పై విధంగా స్పందించారు.ఈ ఏడాది చివర్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠాన్ని అధిష్టించేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తుండటంతో తెలంగాణలో కాంగ్రెస్, ఏఐఎంఐఎం మధ్య విభేదాలు తార స్థాయికి తలెత్తాయి.