మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన CWC కమిటీ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. మంగళవారం ఉదయం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ని సందర్శించారు.

బ్యారేజ్‌ని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ సహా ఆరుగురు సభ్యుల బృందంంలో ఉన్నారు. కమిటీలో అనిల్ జైన్ తో పాటు కె.శర్మ, ఆర్.తంగమణి, రాహుల్ కే సింగ్, దేవేందర్‌రావుతో పాటు సీఈ కేజీబీవో నామినేట్ చేసిన మరో సభ్యులు ఉన్నారు. బ్యారేజీలోని ఆరవ బ్లాకు నుంచి ఎనిమిదవ బ్లాకు వరకు.. 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ వరకు కేంద్రం బృందం నిశితంగా పరిశీలించింది.

20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలతో పాటు బ్యారేజ్‌ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. సమగ్ర పరిశీలన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదించనుంది.

కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఉన్నారు.బ్యారేజ్ పరిశీలన అనంతరం హైదరాబాద్ లో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించి కేంద్రానికి నివేదిక ఈ బృందం నివేదిక ఇవ్వనుంది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొలిమెట్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్.. గోదావరి నదిపై రూ.1849 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ ఉంది. 24 నెలల్లో బ్యారేజీ నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ పూర్తి చేసింది. 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మించారు..

బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు కాగా.. 87 హైడ్రో మెకానికల్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటీ 10 మీటర్ల పొడవు, 4 నుంచి 6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. గేట్ల మధ్య పిల్లర్లలా ఉండే కాంక్రీట్ నిర్మాణం ఉంది.

బ్యారేజ్ నిర్మాణంలో ఒకదశలో కేవలం 72 గంటల్లోనే ఏకంగా 25,584 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది ఎల్ అండ్ టీ. గతేడాది రికార్డు స్థాయిలో 29 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని బ్యారేజ్ తట్టుకుంది.

ప్రస్తుతంపై నుంచి 22 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వచ్చిన నీళ్లను వచ్చినట్లు 57 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్న అధికారులు. ఈ నెల 21న రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్‌ 20వ పియర్‌ కుంగిపోయింది.

దీంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. డ్యాంకు.. క్రస్టు గేటుకు మధ్య పగుళ్లు వచ్చాయి. గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు మహారాష్ట్ర, రెండో వైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి..

కాళేశ్వరం మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటున్న ఇరిగేషన్ శాఖ అధికారులు!!

మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగడంపై కేసు నమోదు చేసిన మహదేవ్‌పూర్ పోలీసులు.

పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో ఫిర్యాదు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు…

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్లతో పాటు ఐపీసీ 427 కింద కేసు నమోదు…

కేసు విచారణకు ప్రత్యక టీమ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు..

*మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ పై కేసు నమోదు*

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

పిల్లర్‌ కుంగడానికి ముందు అక్కడ పేలుడు శబ్దం వినిపించడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చప్పుడు ఎందుకొచ్చింది? పిల్లర్‌ ఎందుకు కుంగింది? ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా? అని ఇరిగేషన్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం మహదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటన జరగడంతో ఏదైనా కుట్రలు ఉండొచ్చని.. దానిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు సానుకూలంగా స్పందించారు. ప్రివెంటేషన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ యాక్ట్‌ (పీడీపీపీ ) సెక్షన్‌ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్‌తో విచారణ మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌ ఖర్గే మాట్లాడుతూ.. ఇందులో మావోయిస్టుల ప్రమేయం లేదని తమ విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు….