నేటి పంచాంగం..నేటి విశేషం…

🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 27 – 08 – 2023,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం,

తిథి : ఏకాదశి సా5.20 వరకు,
నక్షత్రం : పూర్వాషాఢ రా2.50 వరకు,
యోగం : ప్రీతి ఉ11.23 వరకు,
కరణం : వణిజ ఉ6.11 వరకు,
తదుపరి భద్ర సా5.20 వరకు,
ఆ తదుపరి బవ తె4.24 వరకు,

వర్జ్యం : మ1.00 – 2.32,
దుర్ముహూర్తము : సా4.37 – 5.27,
అమృతకాలం : రా10.13 – 11.45,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.17,

*_నేటి విశేషం_*

*శ్రావణ శుద్ధ పుత్రదా ఏకాదశి*

*పుత్రదా ఏకాదశి*

శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి అంటారు.
వివాహమై సంతానం లేక బాదపడుతుండే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిణి విష్ణు సహస్రానామలతో అర్చిన్చినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది…
అందుకే దీనిని *పుత్రాద ఏకాదశి* అని అంటారు…

*శ్రీ కృష్ణుడు యుధిష్టర మహా రాజు కి వివరించిన పురానా గాథ*

పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు.
అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తీ శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు, కాని రాజా వారికి సంతానం కలుగలేదు.
ఎంతో మంది ఋషులను , పండితులను సంప్రదించిన తన సమస్య కు దారి దొరకలేదు .

చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా, మహారాజ వారు అక్కడికి చేరుకొని వెళ్లి తన దుఃఖాన్ని వివరిస్తాడు…
అప్పుడు మహర్షి నువ్వు పడుతున్న భాదలు ఏంటి , నువ్వు చేసిన పాప కర్మములు ఏంటి అని అడుగగా – అప్పుడు తన పూర్వ వృత్తాంతం అంతా చెప్పగా దయార్త హృదయుడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పేదను అని చెప్పి …
శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తీ శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తీ శ్రద్దలతో పూజిస్తే తప్పకుండ మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు…

పూర్వం రాజు వర్తక వ్యాపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్లి అక్కడే నీళ్లు త్రాగుతూ ఉన్న ఒక ఆవుని నీళ్లలోకి తోసేసాడట …
దానికి పాప పరిహారంగా రాజు గారికి సంతానం కలుగలేదు అని కథనం.

మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు.

ఆ తరువాత రాజుకి గారికి మంచి సంతానం కలుగుతుంది, దానికి రాజు చాల సంతోషపడి బ్రాహ్మణులకు , రాజ్యం లో ఉన్న ప్రజలకు చాల దాన ధర్మాలు చేసాడట.

శ్రావణ మాసంలో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపాలు అన్ని హరిస్తాయని , మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి.
ఈ కథ భవిష్య పురాణంలో వివరించడం జరిగింది…

స్వస్తి …
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏