హైదరాబాద్ :
తెలంగాణ విద్యార్థులకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 24వ తేదీ నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 వేలకుపైగా బడుల్లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు అల్పాహారం ప్రారంభించనున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మోడల్ స్కూళ్లు, మదర్సాలు, ఎయిడెడ్ పాఠశాల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది.
టిఫిన్ మెనూ
👉సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
👉మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
👉బుధవారం – బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్
👉గురువారం – రవ్వ పొంగల్, సాంబార్
👉శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్
👉శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు.