Opposition No Confidence Motion . మూజువాణి ఓటుతో వీగిన ‘అవిశ్వాసం’
Opposition No Confidence Motion :
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్ చేశాయి.
దీంతో మూజువాణి ఓటుతో అవిశ్వాసం వీగిపోయింది….గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతోనే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. ప్రధాని మాట్లాడుతుండగా ఓటింగ్కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి…కాంగ్రెస్పై అన్ని రాష్ట్రాల ప్రజలు నో కాన్ఫిడెన్స్ ప్రకటించారని ఈరోజు మాట్లాడుతూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. విపక్షాలు ఇండియాను I.N.D.I.Aగా ముక్కలు చేశాయన్నారు. NDAలో రెండు ‘‘ I ’’లు చేర్చారని .. మొదటి I అంటే 26 పార్టీల అహంకారమని, రెండవ I అంటే ఒక కుటుంబ అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రతీ పథకం పేరు వెనుక కాంగ్రెస్ ఒక కుటుంబం పేరు చేర్చిందని ఎద్దేవా చేశారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు గాంధీ పేరును వాడుకున్నారని ప్రధాని ఆరోపించారు. విపక్షాలది ఇండియా కూటమి కాదని, అది ఘమండియా కూటమి అని అభివర్ణించారు మోదీ. మణిపూర్పై అర్ధవంతమైన చర్చ జరిపే ఉద్దేశం విపక్షాలకు లేదన్నారు. వీళ్ల చర్చలో అసలు విషయమే లేదంటూ మోదీ విమర్శించారు. తాము చర్చకు ఆహ్వానించామని.. కానీ విపక్షాలు చర్చలకు రావడం లేదన్నారు. మోదీ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు…
మోడి స్పందన..
ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి విపక్షాలు పారిపోతున్నాయని మోడీ చురకలంటించారు. మణిపూర్పై చర్చ విపక్షాలకు అవసరం లేదని.. మణిపూర్పై అమిత్ షా పూర్తి వివరాలు అందించారన్నారు. మేం చర్చకు ఆహ్వానిస్తే వారు వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ అంశం కోర్టులో ఉందని, సమీప భవిష్యత్తులో ఈశాన్య రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని అన్నారు. మణిపూర్ కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని అన్నారు. అభివృద్ధి జరుగుతుందని మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు..