దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు.. కుటుంబ పాలనకు అంతం పలకాలి.. రాహుల్ గాంధీ.

*దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలు.. కుటుంబ పాలనకు అంతం పలకాలి.. రాహుల్ గాంధీ

బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ, సంచలన వ్యాఖ్యలు చేశారు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలను బరిలోకి దింపుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేశారు. వరుసగా పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.

అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని, తెలంగాణలో వచ్చేది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా బుధవారం ములుగులో జరిగిన బహి రంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా తెలంగాణలో సరైన పాలన కొనసాగడం లేదని అన్నారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఈ సారి ఎన్నికలు జరగ బోతున్నాయన్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారం.. తెలంగాణ ఇచ్చిందని.. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుందంటూ మండిపడ్డారు. రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని.. కానీ..తెలంగాణ విషయంలో ఆలో చించకుండా నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్‌ గౌరవించి తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో హామీ లిచ్చి మోసం చేశారని విమర్శించారు. అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్‌ మోసం చేసి పాలన చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

ధరణి పోర్టల్‌లో అవినీతి జరిగిందని.. అందుకే తాము రద్దు చేస్తామనన్నామని తెలిపారు. రూ.లక్ష రుణమాపీ అన్నారు..చేయలేదని పేర్కొన్నారు. మూడెకరాల భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పాలన చేయడం లేదని దుయ్యబట్టారు.

రామప్ప వంటి సుందరమైన ఆలయాన్ని ఇప్పటి వరకూ చూడలేదన్నారు. రాహుల్‌గాంధీ. 2004లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చిందని.. ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ఎలా సాకారం చేసిందో ప్రపంచమంతా చూసిందన్నారు…