వడ్డీ రేట్లు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లే వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంఇంది. మానిటరీ పాలసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపోరేటు 6.5 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు కూడా 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటుందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆయన ప్రకటించారు.”రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది. స్థూల ఆర్థిక స్థిరత్వం, సమ్మిళిత వృద్ధి మన దేశ పురోగతికి అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక సూత్రాలు. ఇటీవలి సంవత్సరాలలో ఊహించని విపత్తుల సమయంలో మేము అనుసరించిన పాలసీ మిశ్రమం స్థూల ఆర్థిక, ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించింది.” అని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.