ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ విలీనంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు..
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ విలీనంపై అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆర్టీసీ విలీనం బీజేపీకి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోందన్నారు. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీ ఉద్యోగులను బలవంతంగా రాజ్ భవన్ పంపుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈటల మండి పడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పీఆర్సీలు బకాయి ఉన్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.