చెన్నై:
తమిళనాడు లో ఘోర రోడ్డు ప్రమాదం…
టాటా సుమో, బస్సు ఢీ..
7 మంది మృతి, 14 మందికి గాయాలు…
తిరువణ్ణామలై జిల్లా పక్రిపాలెం బైపాస్ రోడ్డులో ఘటన….
గాయపడిన క్షతగాత్రులను సెంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
ప్రమాద సమయంలో టాటా సుమోలో 11 మంది, సంఘటనా స్థలంలోనే 7 మంది మృతి, నలుగురికి తీవ్ర గాయాలు..
బస్సులోని 10 మందికి గాయాలు…
సంఘటనా స్తలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు..
ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సెంగం పోలీసులు…
తమిళనాడులోని తిరువన్నమలైలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అందన్పూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమో – బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.