తారకరత్నకు కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్కృష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్తానంలో తారకరత్న చితికి మోహనకృష్ణ నిప్పుపెట్టారు. చివరిసారి తారకరత్న నుదిటిపై తండ్రి మోహనకృష్ణ ముద్దుపెట్టి కన్నీరుమున్నీరయ్యారు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కలిచివేశాయి. కాగా..తారకరత్న పాడెను చిన్నాన్న రామకృష్ణ, బాలకృష్ణ, ఇతర బంధువులు మోశారు. భారమైన హృదయాలతో తారకరత్నకు చంద్రబాబు, లోకేష్, ఎంపీ విజయసాయి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.