ప్రముఖ తెలుగు నటుడు పోసాని కృష్ణమురళి కరోనా భారినపడ్డారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. నిన్న పూణే నుంచి హైదరాబాద్కు వచ్చారు. అయితే వచ్చినప్పటి నుంచి కాస్త నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా.. కరోనా సోకినట్లు తేలింది. దాంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పోసాని ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా పోసానికి కరోనా పాజిటివ్ రావడం ఇది మూడోసారి. నిన్న తెలంగాణలో 45 కరోనా కేసులు నమోదు కాగా.. హైదరాబాద్లోనే 18 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.