ఈరోజే రానున్న తెలంగాణ ఎన్నికల షెడ్యుల్..
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది….ఈ ఎన్నికల ప్రక్రియ నవంబర్ రెండోవారంలో మొదలై డిసెంబర్ మొదటి వారంలో ముగుస్తుందని ఈసీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్ ఒకే దశలో నిర్వహించాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్లో రెండు దశల్లో నిర్వహించనున్నట్టు తెలిసింది. 2018లో కూడా ఇలాగే పోలింగ్ నిర్వహించారు…
ఈరోజు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్నికల సంఘం..
మిజోరం అసెంబ్లీకి డిసెంబర్ 17తో గడువు ముగుస్తుంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలో వివిధ తేదీల్లో గడువులు ముగుస్తాయి. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా, తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ర్టాల్లో పోలింగ్ వేరువేరు తేదీల్లో నిర్వహిస్తారని, కౌంటింగ్ మాత్రం ఒకేరోజు ఉంటుందని ఈసీ వర్గాల సమాచారం. ఈసీ సభ్యులు ఈ ఐదు రాష్ర్టాల్లో ఇప్పటికే పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు…