టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు చేయడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్పందించింది…టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంను గులాబీ మయంగా మారింది. లేటుగా స్పందించినా అధికారులు చల్లాన్ల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు..
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్లు విధించింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్పందించింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. నేటి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం ప్రారంభించారు. ప్లీనరీ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు జీహెచ్ఎంసీ 2 లక్షల 35 వేల జరిమానా విధించింది. అదేవిధంగా మంత్రి తలసానికి లక్ష 5 వేల రూపాయల ఫైన్ విధించింది. మంత్రి మల్లారెడ్డికి 10000 రూపాయల ఫైన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి 25 వేల రూపాయల ఫైన్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో 95,000 రూపాయల జరిమానా విధించింది. శేరిలింగంపల్లి టీఆర్ఎస్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్కు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించింది..