తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తాం…కేంద్రమంత్రి అమిత్ షా..

మోదీ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. సూర్యాపేట జన గర్జన సభలో మాట్లాడిన అమిత్ షా… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి చెందందని అన్నారు.మోదీ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. సూర్యాపేట జన గర్జన సభలో మాట్లాడిన అమిత్ షా… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి చెందందని అన్నారు…
అమిత్ షా సభలో మాట్లాడుతూ…
రాష్ట్రంలోని పేదల బాగుకోసం బీజేపీ పని చేస్తుంది. కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసమే ఆలోచిస్తాయి. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాను.
పేదల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్. దళితలు, బీసీలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్. దళిత ముఖ్యమంత్రి హామీని మర్చిన వ్యక్తి కేసీఆర్. దీని ప్రకటన చేయాలి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. ఆ హామీ ఏమైంది..?
బీసీలకు బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసింది..?
బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటిస్తాం. గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది. ఇటీవలే మంజూరు చేసిన ట్రైబల్ వర్శిటీకి సమ్మక్క – సారక్క పేరును నిర్ణయించాం. ఈ ఘనత మోదీకే దక్కుతుంది.
కృషా జలాల సమస్య కోసం ఇటీవలే కొత్త ట్రిబ్యూనల్ ను ప్రకటించాం.
జల జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి నీటిని అందిస్తున్నాం.
అయోధ్యంలో రామమందిరాన్ని పూర్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సూర్యాపేట ప్రజలు కూడా తరలి రావాలి.
తెలంగాణలో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను….