గ్రూప్-1 అభ్యర్థులకు కీలక సూచనలు..
*తెలంగాణ/(Telangana)* తెలంగాణలో గ్రూప్ 1(group.1) పరీక్షకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకోగా..
మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు చేసింది.
పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు..
పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్ బ్యాగ్లు, పర్సులకు అనుమతి నిరాకరణ…
అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు…
నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి
జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్ గుర్తించదు
వైట్నర్, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్తో బబ్లింగ్ చేసే ఓఎంఆర్ షీట్ చెల్లదు
3 పాస్పోర్టు సైజ్ ఫొటోలను(phot) గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలి..