గద్వాల్: జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ ,నర్సింగ్ హోమ్స్, స్కానింగ్ సెంటర్స్ ,డయాగ్నస్టిక్ సెంటర్స్ నీ, ఆకస్మికంగా తనిఖీలు చేశారు ,తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010 ప్రకారం జిల్లాలోని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా మరియు క్వాలిఫై డాక్టర్స్. మరియు క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ మరియు క్వాలిఫైడ్ స్టాఫ్. లేకుండా నిర్వహించే ప్రైవేట్ హాస్పిటల్స్ , నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, స్కానింగ్ సెంటర్స్, డయాగ్నస్టిక్ సెంటర్స్ ఎవరైనా నిర్వహించినచో నోటీసులు ఇస్తామని, ఇచ్చిన నోటీసుకు సరియైన వివరణ ఇవ్వనిచో సీజ్ చేస్తామని అధికారులు ఆదేశించారు.
ఏ ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ అయిన ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు మాత్రమే ఆ ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్లో సేవలు అందించాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాకుండా, అన్ క్వాలిఫైడ్ వారు సేవలందించిన ఎడల, తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో Dy.Dmho Doctor S.k సిద్దప్ప, మాత శిశు సంరక్షణ ప్రోగ్రామ్ ఆఫీసర్ S. శశికళ, ప్రోగ్రాం ఆఫీసర్ మారుతి నందన్ గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇర్షాద్ , డాక్టర్ రవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది,M. రామకృష్ణుడు,K. మధుసూదన్ రెడ్డి ,T. నర్సింలు , శ్యాంసుందర్ పాల్గొన్నారు.