తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు…భారీగా దరఖాస్తులు..

తెలంగాణలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తు గడువు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగిసింది. మద్యం టెండర్లు ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి చేరింది. నిన్నటి వరకు 69, 965 దరఖాస్తులు రాగా.. రూ.1,399 కోట్లు ఆదాయం సమకూరింది.
..చివరి రోజు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గురువారం వరకు 69,965 వచ్చిన దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,399 కోట్లు ఆదాయం సమకూరింది. 2021లో వచ్చిన రూ. 1,357 కోట్ల కంటే ఎక్కువని అధికారులు తెలిపారు. చివరి రోజు భారీ ఎత్తున దరఖాస్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు తిరిగి ఇవ్వని నగదు చలాన్‌ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించనున్నారు. ఈ మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీ కింద ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ఎంపిక ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో పూర్తి కానుంది. డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.