వరంగల్ జిల్లా: తెలంగాణలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు కలకలం రేపాయి. శనివారం రాష్ట్రంలో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల్లో అధికారులు ముమ్మరంగా సోదాలు చేశారు.
మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల సరఫరా లక్షంగా అధికారులు రైడ్స్ చేశారు.
ఈ తనిఖీల్లో ఎన్ఐఏ అధికారులు పెద్ద ఎత్తున డ్రోన్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిపై కేసులు నమోదు చేశారు…