రాష్ట్ర వాతావరణ శాఖ మరోసారి వడగండ్ల వాన అలర్ట్ను జారీ చేసింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వానలు కురుస్తాయని, రెండు రోజులు (శుక్ర, శనివారాలు) వడగండ్ల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్తాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.