తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది.
దేశంలో తెలంగాణా రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పే ప్రయత్నం చేస్తుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్. తెలంగాణా రాష్ట్రానికి మూడో వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది . ఈ నెల 24 వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించనున్నారు..
ఇప్పటికే సంక్రాంతి గిఫ్ట్గా సికింద్రాబాద్-విశాఖపట్టణం వందేభారత్ రైలు, ఉగాది కానుకగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా.. నేడు కాచిగూడ-బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభించనుంది. మధ్యాహ్నం పన్నెండుర గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ ఈ రైలును వర్చువల్గా ప్రారంభించనున్నారు. అయితే మిగతా వందేభారత్ రైళ్ల తరహాలో కాకుండా ఇందులో కేవలం ఎనిమిది కోచ్లు మాత్రమే ఉంటాయి..