వినాయక చవితి ప్రత్యేకత, విగ్రహా ప్రతిష్ఠి సమయం ఇదే..!

భారత్‌తో ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగల్లో గణేష్‌ చతుర్థి ఒకటి. ఈ పండగను భాద్రపద మాసం, శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు. ఈ పండుగ శుక్ల పక్ష చతుర్థి రోజు ప్రారంభమై..అనంత చతుర్దశి రోజు ముగుస్తుంది. ఈ పండగను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 19న గణేష్ పండగ వస్తోంది. కానీ కొన్ని గ్రహాల కలయిక కారణంగా గణపతి ప్రతిష్ఠాపన సమయంలో మార్పలు చేర్పులు ఉండే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు ఏయే సమయాల్లో గణపతి ప్రతిష్ఠాపన చేయడం మంచిది ఆన్ని నమ్మకం..భారత్‌ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. యువత ఎంతో ఉత్సహంతో డప్పు వాయిద్యాలతో గణేషుడి విగ్రహాన్ని మండపాల వద్దుకు తీసుకువస్తారు. అంతేకాకుండా యువత ఈ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. అయితే మండపాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో ఈ ప్రత్యేక ఆచార వ్యవహారాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

అనుకూల సమయాలు..

చతుర్థి తిథి 18 సెప్టెంబర్ 2023న మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 01:43 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గణపతి ప్రతిష్ఠాపనకు లేదా పూజకు అనుకూలమైన సమయం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 01:28 వరకు ఉంటుంది. ముహూర్తపు మొత్తం వ్యవధి 02 గంటల 27 నిమిషాలు పాటు ఉండబోతోందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు:
వినాయ చవితి ఒక రోజు ముందు చంద్రుడిని చూడకూడదని పూరణాల నుంచి ఆనవాయితిగా వస్తోంది. సెప్టెంబర్ 18 రోజున మధ్యాహ్నం 12:39 నుంచి రాత్రి 08:10 వరకు చంద్రుడిని చూడకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం కాలం వ్యవధి 10 గంటల 59 నిమిషాలు పాటు ఉంటుంది.